27, ఏప్రిల్ 2015, సోమవారం

మత సంస్థల సూత్రీకరణలు- ప్రలోభాలు -2


           గతం లేదు. వర్తమానం, భవిష్యత్తు మాత్రమే ఉంది. అది కూడా భవిష్యత్తులో ఆత్మ మాత్రమే మిగులుతుంది. అది స్వర్గ, నరకాలనే రెండు ప్రత్యామ్నాయాలను మాత్రమే చూపిస్తుంది. జడ్జిమెంట్ డే తర్వాత శాశ్వతంగా స్వర్గమో, నరకమో ప్రాప్తిస్తుంది. ఈ రకమైన పదార్ధాన్ని విక్రయిస్తున్నవి క్రిష్టియన్, ఇస్లాం మతసంస్థలు, వాటి శాఖలు.

                వీటిలో ప్రకృతి స్వరూపమైన జగత్తు అనగా ఈ మహా విశ్వానికి ప్రాధాన్యత తక్కువ.

                                 ప్రకృతికీ, ప్రకృతి స్వరూపమైన స్త్రీకీ మరీ అల్పమైన చోటూ ఉంటుందక్కడ. ఎందుకంటే స్త్రీ నరుడి నుండి బయటకు తీసిన పక్కటెముక స్వరూపిణీ కదా.

                       మానవ జన్మనే వీరు పాప చర్యగా  ప్రచారం చేస్తారు. భూమి అనేది తప్పించుకోవలసిన స్థలంగా వీరు ప్రచారం చేస్తారు. ఆడం అండ్ ఈవ్ అనే సిద్ధాంతం తయారు చేసినా, నేడు మగవాడు తన ఎముకతో తయారు చేసిన ఈవ్‍ని గుర్తించాలా వద్దా; ఏదో ఒక ఈవ్‍నా, లేక అనేక ఈవ్‍లతో జత కట్టాలా అనే విషయాలలో స్పష్టత ఉండదు. ఒక మగవాడు తన ఈవ్‍ని గుర్తించడం ఎలా అనే విషయంలో స్పష్టత లేదు.

                                               ఈ సిద్ధాంత, వ్యాపార విస్తరనతో ముందంజలో ఉంది.  సిద్ధాంత ఆధారంగా వివాహాలు చేసుకొనే వ్యక్తులు తమ దైవమే తమను కలిపిందని విశ్వసిస్తారు. ఇతరులకు అదే చెప్తారు. మరి వారి దేవునికి సమాన శక్తి కలిగిన సైతాన్ ఈ వివాహ ప్రక్రియలో స్త్రీ పురుషుల కలయికల విషయంలో ఎలా జోక్యం చేసుకుంటాడు. ఈ మతమార్గ శాఖాధిపతి పద్ధతుల్లో సైతాన్ వర్గం వారు ఎంత మంది ఉన్నారు. ప్రచారకుల్లో ఎంత మంది ఉన్నారు. వారు వీరి దేవుళ్ళకు వ్యతిరేకంగా ఏ విధమైన నిర్మాణ, ప్రచారాలు చేస్తారు? ఇలాంటివన్నీ అయోమయం.

కామెంట్‌లు లేవు: