మనం సరిగ్గా గమనిస్తే ఇలా ప్రచారం చేయడం అనే ప్రక్రియ, అల్పమైన భౌతికావసరాలు తీర్చే కంపెనీలు చేసే ప్రచారాన్ని పోలి ఉంటుంది.
సబ్బులు, కండోమ్లు, వాహనాలు, బట్టలు మొదలైన వస్తువులు అమ్మే కంపెనీల ప్రచారాలకూ; మతం, మార్గం, జీవన విధానం అంటూ ప్రచారం చేసే సంస్థలకూ బేధం లేదు.
ప్రచారం అనే ప్రక్రియ అస్త్యం, అధర్మం యొక్క అవసరం.
సత్యానికీ, ధర్మానికీ, దైవానికీ ప్రచారం అనేది అవసరం లేదు.
నేడు, సత్యం, ధర్మం, దైవం అనేవి తెలుసుకోవలసిఅన్ పదార్ధాలే తప్ప, ప్రచారం పొంది, మార్కెట్ వృద్ధి చేసుకోవలసిన పదార్ధాలు కావు. పైగా వాటిని తెలుసుకున్న మరుక్షణం చీకటిలోకి వెలుతురు ప్రసరించినట్టుగా, అంతకు ముందు జరుగుతున్న ఈ దుష్ట వ్యాపారం నిలిచి పోతుంది, నశిస్తుంది.
ఇలాంటి సంస్థల అంతిమ లక్ష్యం ధన సంపాదన, రాజ్యధికారం. దేవుని రాజ్యంలోకి ప్రవేశం, స్వర్గంలోకి మోక్ష సిద్ధి, జన్మ రాహిత్యం, నిత్యానందం, దుఃఖ రాహిత్యం, అమరత్వం, సమ సమాజం- ఇలాంటి పదాలన్నీ వ్యక్తీ అనే చేపని పట్తడానికి మత( ఆధ్యాత్మిక) వ్యాపార సంస్థల గేలానికి గుచ్చిన ఎరలు. ప్రతీ వ్యక్తీ ఏదో ఒక వ్యాపారానికి దొరక్క పోడు కదా!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి