11, ఏప్రిల్ 2015, శనివారం

బంధం- పర్యావసానాలు -2


                                     



                                బంధం ద్వారా వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. పర వ్యక్తిత్వాన్ని తన "స్వంతం" చేసుకుంటాడు. ఇలా అనేక వ్యక్తిత్వాల "సమ్మేళనం" ద్వారా వ్యక్తిలో "సంఘర్షణ" అనేది మొదలవుతుంది. మానసిక ఒత్తిడి ,సంఘర్షణ ఫలితంగా వ్యక్తి తాను చేయదలుచుకున్న పనులు చేయడానికి "తీవ్రఘర్షణ" పడుతుంటాడు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే- వ్యక్తి తన శక్తి సామర్ధ్యాలతో పని చేయడం మానేసి, తాను కోరుకొనే పనులు చేయడం మొదలు పెట్టాడు. కోరిక అనేది ఇంకొకరి కోరికకు ఆటంకంగా పరిణమిస్తుంది. అప్పుడు కోరిక తీర్చుకోవడానికి వ్యక్తి అంతర్గత ( మానసిక, ఆత్మిక, ప్రకృతి పరమైన) ఘర్షణ పడతాడు. ఇది తరుచుగా భాహ్య ఘర్షణలకు, యుద్ధాలకు మూలం అవుతుంది.

కామెంట్‌లు లేవు: