31, మార్చి 2015, మంగళవారం

వ్యక్తి సమస్యలు



                         ఇప్పుడు వ్యక్తి సమస్యల దగ్గరకు వద్దాం. సమస్యలు ఇవి అవి అని ఇక్కడ తెలియజేయనవసరం లేదు. అవి అందరికీ తెలిసినవే! ఎదో తెలియని వెంటాడే దుఃఖం కావచ్చు. అనారోగ్యాలు కావచ్చు. మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, సామాజిక, కుల, మత సమస్యలు , ఆర్థిక సమస్యలు ఇలా అనేకం ఉన్నాయి. అయితే వీటికి పరిష్కారం కోసం ఒక్కో సమస్యకి పరిష్కార మార్గాలుగా చెలామణిలో అనేకం ఉన్నాయి. కానీ వ్యక్తికి సమస్యలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.

ఏ వ్యక్తికైనా అర్థం కావలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ సమస్యకైనా ఒకే పరిష్కారం ఉంటుంది. అనేకం ఉండవు అని.
                ఇప్పటికిప్పుడు మనిషికి - వ్యక్తికి వచ్చే సమస్యలు పరిష్కారం చూపడానికి లక్షలాది కారణాలు, కోట్లాది పరిష్కార మార్గాలు ప్రచారంలో ఉన్నాయి.

     దైవాలుగా ప్రచారం పొందిన విష్ణు, ఏసు, అల్లా వంటివారి నామ జపాలతో సమస్త బాధలు తీరిపోతాయని , ఆశ్రమ ధర్మాలు పాటిస్తే సమస్యలు రావని, లేదా పోతాయని, మంత్ర జపాలు చేయాలని, జాతక దోషాలు గుర్తించి వాటిని నివారించాలని, ధ్యానం, యోగా ఙ్ఞాన విద్యనభ్యసించడం, సరియైన జీవన విధానాన్ని అనుసరించడం వల్లా, వైద్యం మొదలైన వాటి ద్వారా సమస్యలు రాకుండా చూసుకోవాలనీ- వచ్చిన వాటిని నివారించాలని కొందరు అంటుంటారు.

            ఇంకొందరు - సమాజ నిర్మాణ స్వరూప , స్వభావాలను మార్చడం ద్వారా సమస్యలను పరిష్కరించాలనీ, దానికి రామరాజ్యమే శరణ్యమనీ, సనాతన ధర్మమే మేలనీ కొందరు భావిస్తారు. భౌతిక జీవితం తుచ్చమై పాప పంకిలమని భావిస్తారు. స్వర్గం, జన్మ రాహిత్యం, పరలోక రాజ్యం మొదలైనవి అన్నీ- ఇలా అనేక మార్గాలను కొందరు ప్రచారం చేస్తుంటారు. కుల, మత రహిత సమాజం ద్వారా ఇది సాధ్యమనీ, లేదా సమసమాజం( కమ్యూనిజం) ద్వారా ఇది సాధ్యమనీ ఇలా అనేక రకాల సిద్ధాంత రాద్ధాంతాలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. వీటి వలన  వ్యక్తి యొక్క సమస్య మూలాలను గ్రహించలేని స్థితి నెలకొని ఉంది. ఏది సరైన మార్గమో, ఎవరు సరైన నాయకుడో, గురువో, దైవమో తేల్చుకోలేని అయోమయ స్థితి ఉంది. గుళ్ళు, చర్చీలు, మసీదులు, ఇలా అనేక స్థలాల్లో తమ సమస్యలు తీరాలని మొక్కే వారు, ప్రార్ధించేవారు అనేకులు ఉన్నారు. 

            వ్యక్తి తన "సమస్య " ఏమిటో తెలియక పోవడం వల్ల, తెలుసుకునే ప్రయత్నం చేయక పోవడం వల్ల , తప్పుడు అవగాహనతో, తప్పుడు మార్గాలలో పరిష్కారాలను వెతుకుతున్నాడు. దాని వలన తప్పుడు మార్గాలు, తప్పుడు ఙ్ఞానం పెరిగిపోయి అందులో చిక్కుక పోయాడు. ఎంతగానంటే సమస్యలు పరిష్కరించాలని మానవాళి అంతా ప్రయత్నించినా సాధ్యం కానంత సంక్లిష్ట స్థితిలో కూరుక పోయాడు.
                      ఇలా ఎందుకు జరిగిందంటే ధర్మం క్షీణించడం, వ్యక్తిత్వం కలుషితం కావడం, పరాయీకరణ చెందడం, దోపిడీకి గురికావడం, దోపిడీ చేయడం అనే ప్రక్రియల ద్వారా ఇది జరిగింది. 

30, మార్చి 2015, సోమవారం

భౌతిక ప్రపంచం , ఆత్మిక ప్రపంచం

                  వ్యక్తి, స్వేచ్చ, హక్కులు లాంటి నినాదాలు, ఉద్యమాలు, పోరాటాలు, సిద్ధాంతాలు, అధర్మం యొక్క రూపాలు. అధర్మం యొక్క కుట్ర పూరిత కుతంత్రం తప్ప మరేమీ కాదు.

            దేహ పరమైన, దేహి పరమైన అస్థిత్వాలు రెండింటికీ ఇదే స్థితి గతులు ఉంటాయి. అంటే భౌతిక, అధిభౌతిక అస్థిత్వాలు అన్నమాట.

             భౌతిక ప్రపంచం వేరు, ఆత్మిక ప్రపంచం వేరు, అవి ఒక దానికి ఒకటి భిన్నమైనవి, లేదా ఒక దానికొకటి అతీతమైనవనే అభిప్రాయాలు బాగా చలామణిలో ఉన్నాయి. అది అసత్యం. ఆత్మ, శక్తి, దైవంలాంటివన్నీ ఒకే దేహంలోని భాగాలు మాత్రమే. వీటికి  విడివిడిగా అస్థిత్వాలుగానీ, స్వరూప, స్వభావాలుగానీ లేవు.

                            భౌతికమైన కంటికి కనిపించే సమస్త విశ్వాలకు, అధిభౌతిక నేత్రాలకు మాత్రమే కనిపించే విశ్వాలకు ఆధారంగా ఉన్నది ఒకే వ్యక్తిత్వం. అది "దైవం" అనే వ్యక్తిత్వం. దీనికి కూడా రెండు రూపాలు, అస్థిత్వాలు ఉన్నాయి. దైవం అనే వ్యక్తిత్వం కలిగిన ప్రకృతి+ పురుషుడు( ఆత్మ+ శక్తి, ఆడ+ మగ) దేవత , దేవుడు అనే రెండుగా విడిపోయి రెండు స్థానాలలో ఉంటారు. వీరికి కూడా భౌతిక, అధిభౌతిక దేహాలుంటాయి. వాటికి కూడా జనన మరణాలుంటాయి.

                 రెండు రకాల అస్థిత్వాలను అవిభాజ్యంగా కలిగి ఉన్న విశ్వం యొక్క నిర్మాణ స్వరూప స్వభావాలను పూర్తిగా వివరించడం అనేది ఈ సందర్భంలో అప్రస్తుతం.కనుక మనిషి సమస్త సమస్యల మూలాన్వేషణకు ఈ ప్రాథమిక సమాచారం సరిపోతుంది.

29, మార్చి 2015, ఆదివారం

స్వంత పిల్లలు




                                     పిల్లల పట్ల తల్లితండ్రులు ఎందుకు వ్యాపార ధోరణులతో ఆలోచిస్తారు, నిర్ధాక్షణ్యంగా ప్రవర్తిస్తారు. కుల, మత, జాతి బేధాలతో పెంచుతారు. 

                 పిల్లల తమ జీవనాధారం కోసం ఎంచుకొనే వృత్తి , తమ భవిష్యత్తు అయిన  "వివాహం" లాంటివన్నీ ఎందుకు తల్లితండ్రుల, కుల, మత పెద్దలు తమ అదుపులో ఉంచుకోవాలని చూస్తారు?

ఎందుకంటే?

                 పిల్లలు అనేవారు, కన్న బిడ్డలే కానీ ఆ వ్యక్తుల " స్వంతపిల్లల్ని వారు కనడంలేదు. అసలు వ్యక్తులకు స్వంత పిల్లలు ఉంటారన్న ఙ్ఞాపకత్వ లేదు! ఈ వ్యాపార జీవితంలో వేల సంవత్సరాల క్రిందటే అమ్మేసారు.

                   "స్వంతం" అయిన దాన్ని అమ్మేసి పరాయిని స్వంతం చేసుకొని పరాయీకరణపాలై నానా హింసలు, వేదనలు అనుభవిస్తున్న మానవాళి "విషాద" మహా ప్రస్తానానికి చరమ గీతం ఈ పుస్తకం.

                                        వ్యక్తుల చర్యలను నియంత్రించేది , ఇష్టా ఇష్టాలను నిర్ణయించేది, వ్యక్తికి వచ్చే ఆలోచనలు, ఉద్వేగాలు, ద్వేషం యొక్క స్థితి, గతి, ఆరోగ్య, అనారోగ్యాలు మొదలైనవి అన్నీ కూడా వ్యక్తి యొక్క కుటుంబం ద్వారా జరుగుతాయి. ఓటు హక్కును వినియోగించుకోవడం లాంటి ప్రక్రియలు ఇలానే జరుగుతాయి. రోడ్లపైన అడుక్కునే బిచ్చగాడి నుండి; చిరిగిన, మాసిన బట్టలతో జుట్టు, గడ్డం పెంచి నిర్ధిష్టమైన పరిధిలో సంచరిస్తూ,పిచ్చివారిలా కనిపించేవారైనా, కన్న తల్లితండ్రులను వదిలి హిమాలయాలలో ఘోర తపస్సులు చేసే అఘోరాలైనా,తీవ్ర వాదులైనా తమ కుటుంబ ప్రయోజనాల కోసమే   ఉంటారు. అంతే తప్ప, వ్యక్తులు అనుకున్నట్లుగానో, లేదా వారు చెప్పినట్లుగానో, అవి స్వేచ్చాయుత స్వతంత్ర్య చర్యలు కావు. వారు కుటుంబ అధిపతుల యొక్క ఆఙ్ఞల మేరకే, వారి కను సన్నలలోనే ఉంటారు అనేది బహిర్గతం కావలసిన "సత్యం".

                                                 ఒక వ్యక్తి తన ఆధీనంలో ఉండడం, ఉండలేక పోవడం అనే సమస్య వుంది. కనురెప్ప కదలికల మొదలు, నడక ,మాట, నిద్ర, ఆలోచన, అంతిమంగా తాను ఎలా జీవించాలి, మరణించాలి అనే సమస్త వ్యక్తి ప్రక్రియలు ఏవీ ఆ వ్యక్తి ఆధీనంలో ఉండవు. అన్నీ పరాధీనమై ఎవరో,  ఎలానో కూడా తెలియకుండా; తెలుసుకోలేని  స్థితిలో పరుల చేత నియంత్రించబడే యంత్ర స్థితికి చేరుకున్న వ్యక్తికి స్వాతంత్ర్యం, స్వాధీనం లాంటి పదాలకు అర్థం తెలిసే స్థితే లేదు. 

                                             వ్యక్తికే తెలియనన్ని రూపాలతో వ్యక్తి జీవితం మొత్తం నియంత్రిస్తూ ఉంటే వాటి నుండి బయట పడకుండానే స్వేచ్చ గురించి తపించడం అర్థ రహితం.

28, మార్చి 2015, శనివారం

స్వేచ్చ

        


                                     నేడు చలామణిలో ఉన్న వ్యక్తి స్వేచ్చ అనేది తప్పుడు భావన, అర్థ రహితం.

                స్వ+ఇచ్చ= స్వేచ్చ, ఆంగ్లంలో Freedom, స్వ అనగా నా; ఇచ్చ అంటే ఇష్టం - నా యొక్క ఇష్టం. అదేమిటో తెలియాలంటే "నేను" అనే పదార్ధం ఏమిటో తెలిసుండాలి. అంతేగాని తాగి తిరగడం, నచ్చిన స్త్రీ, పురుషుడితో కోరుకున్నట్లు తిరగడమో , నచ్చిన సిద్ధాంతాలనూ, దేవుళ్ళనూ, నమ్మడమో కాదు స్వేచ్చ అంటే.
స్వేచ్చ అంటే దేని నుండో, ఎందుకో- అనేది బుకాయింపు, దబాయింపు లేని తార్కిక బుద్ధికి అది తెలిసి ఉండాలి.

                స్వేచ్చకు సరైన అర్థం ఏమిటంటే వ్యక్తి ధర్మబద్ధంగా జీవించగలిగినప్పుడే నిజమైన స్వేచ్చ, స్వాతంత్ర్యం లభిస్తుంది. మిగిలినదంతా భ్రమాత్మక ఆత్మ వంచన, ప్రకృతి వంచన తప్ప మరొకటి కాదు.

                        ఒక వ్యక్తి తన ఆలోచనలు, పనులు, సంవేదనలు, అన్నీ కూడా ఆ వ్యక్తిలోనే మొదలై, ఆ వ్యక్తిలోనే అంతమవుతున్నాయి. అంటే ఆ వ్యక్తి "స్వేచ్చాజీవి" కింద లెక్క. ఆ వ్యక్తి తన చర్యల గురించి, కార్యాకరణ సంబంధాల గురించి "నాకు తెలియదు" లాంటి పదాలతో పారిపోకుండా చెప్పగలడు అని అర్థం. కానీ అదృష్టవశాత్తో, దురదృష్టవశాత్తో అలా చెప్ప గలిగిన వారు ఇంతవరకూ భూమ్మీద పుట్టలేదు. "నీకు చెప్పవలసిన అవసరంలేదు. నీకెందుకు చెప్పాలి. నా ఇష్టం, నాకు అనిపించలేదు , అంతే !" ఇలా డిప్పలో దాగే తాబేలు వ్యక్తిత్వాలే తప్ప, తాను చేసిన పనికి కార్యాకారణ సంబంధం చెప్పగలిగే, లేదా తెలపగలిగిన వ్యక్తులు లేరు.

                          ఇంత వివరం ఎందుకంటే! వ్యక్తి స్వేచ్చ అనే నేటి తప్పుడు భావాన్ని ఖచ్చితంగా మనం గ్రహించాలనే! నేటి సమాజంలో ఒక కుటుంబాన్ని, అందులోని సభ్యులను, వారి ఇష్టా ఇష్టాలను కొద్దిగా గమనిస్తే చాలు. నలుగురు ఉన్న కుటుంబంలో ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు. ఇలా ఎందుకు జరుగుతుందంటే అ నలుగురు వ్యక్తులు, నాలుగు రకాల "వ్యక్తిత్వాలతో" నాలుగు కుటుంబాలకు ప్రతినిధులై ఉంటారు.  ఒకే ఇంటిలో భార్య, భర్త, పిల్లలుగా కంటికి కనిపించే  బంధంలో ఉన్నప్పటికీ, వారి మూలాలు వేరు వేరు కుటుంబాలలో ఉంటాయి.

27, మార్చి 2015, శుక్రవారం

పవిత్ర కుటుంబం HOLY FAMILY



సృష్టి ఆదిలో కుటుంబాలు కాలుష్య రహితంగా ఉన్నాయి. భూమిలోనూ భూమిపైనా జీవరాశికి సంబంధించిన ప్రతి కుటుంబం జీవించడానికి సొంత ఆస్థి ఉంది. సొంత ఆస్థి అనగా - భూమి, ప్రకృతి, పశు పక్ష్యాదులు, పనిముట్లు, వాహనాలు. ఇలా ఆ మానవుడి సొంత కుటుంబానికి అవసరమైన సమస్తం.

ఆ కుటుంబం యొక్క సొంత ఆస్థులు అవిభాజ్యమైన భాగాలు. కుటుంబానికి సంబంధించిన సొంత ఆస్థి యొక్క స్థిరాస్థులన్నీ, వాటి స్థిర రూపాలతో ఆ కుటుంబం యొక్క అధిపతి మానవుడి ప్రకృతి  మూల స్వరూపాధీనంలోనూ, అలాగే ఆత్మ మూల స్వరూపాధీనంలోనూ ఉంటాయి. వాటి వ్యక్త రూపాలుగా భూమిపైన వారి స్వంత నేల, వ్యక్తులు, సాధనాలు, నీరు, జీవ జాతులు ఉంటాయి. ఇదీ పవిత్ర కుటుంబమం అంటే. పరాయితనం లేని స్వచ్చమైన ఈ కుటుంబం యొక్క సహజ నిర్మాణ అస్థిత్వ స్వరూపమే పవిత్ర కుటుంబం.

వ్యక్తి యొక్క గతమంతా ఆ వ్యక్తి ప్రకృతిలో ఙ్ఞాపకంగా నమోదయి ఉంటుంది. పాత విషయాలను రికార్డులను చూసి తెలుసుకోగలిగినట్లు, ప్రతి వ్యక్తీ తన గతాన్ని తెలుసుకొనగలిగే సదుపాయం ఉంది.

"నేను" అంటే - ఈ కుటుంబం యొక్క సంఫూర్ణ స్వరూపంలో ఒక పరమాణు విభాగం మాత్రమే. అంటే పరమాణువులోని ఋణ, ధనాత్మక స్వభావాలలో ఒకటి మాత్రమే.

వ్యక్తి తన కుటుంబం యొక్క అవిభాజ్యమైన మొత్తంలో ఒక భాగం. కుటుంబం యొక్క సొంత ఆస్థిలో ప్రతి వ్యక్తిత్వానికీ ఖచ్చితమైన వ్యక్తిగతమైన సొంత ఆస్థి అనేది ఉంటుంది. వ్యక్తి- వ్యక్తిగత సొంత ఆస్థి; కుటుంబం, కుటుంబ సొంత ఆస్థి అనేవి అవిభాజ్యమైనవి. ఒక అవయవం ఎలాంటిదో; అతనికి,  అతని వ్యక్తిగత ఆస్థి కూడా అలాంటిదే. వ్యక్తిత్వం అనేది కేవలం వ్యక్తి దేహంలోనో లేదా ఆత్మలోనో మాత్రమే ఉండేది కాదు. అతని సొంత ఆస్థిలోనూ ఉంటుంది.

25, మార్చి 2015, బుధవారం

మానవుని సమస్య

ఒక యూనిట్ లోని ఒక వ్యక్తిత్వం కలిగిన ఆడ, మగ వ్యక్తులు గానీ, వేరే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తితోగానీ , వ్యక్తులతో గానీ సంభవించడం ద్వారా వ్యక్తిత్వాల కలయిక అనేది జరుగుతుంది. కలుషితం కావడం అనేది ఇక్కడి నుంచే మొదలయింది.

సొంత స్వభావం, వ్యక్తిత్వం ఉన్న ఆడ, మగల కలయిక తప్ప మిగిలిన కలయికలన్నీ కాలుష్య కారకాలే, బంధ కారకాలే! బంధుత్వం, కులం, గోత్రం, మతం, ప్రాంతం, భాష, కులాంతర, మతాంతర, దేశాంతర, ఖండాంతర - ఇలా అనేక రకాలుగా జరుగుతున్న కలయికలన్నీ కూడా కాలుష్య కారకాలే తప్ప; స్వచ్చమైన, సహజమైన, వ్యక్తిత్వాల కలయికలు కావు అన్నది నేడు మానవాళి గుర్తించవలసిన సత్యం.
 
మానవుడి "సమస్య" ఏమిటి? అనేది ప్రశ్న. మానవుడి సమస్య "కాలుష్యం" అంటే! మానవుడు "కలుషితం" కావడం అనేది మానవుడి సమస్యకు మూలం- మొదలు.

ఇలా మొదలైన "కలుషిత" మానవ సంబంధాల వలన నేటికీ, ప్రతి వ్యక్తీ తన సొంత "స్వభావాన్ని" వ్యక్తిత్వాన్నీ గ్రహించలేని హీనమైన స్థితికి చేరుకున్నాడు.
ప్రతి మనిషీ ఒక కుటుంబంలో సభ్యుడు. ఈ కుటుంబం అనేది కోట్ల సంఖ్యలో సభ్యులు కలది.

ప్రతీ కుటుంబానికి "అధిపతి " అయిన మానవుడు ఉంటాడు. ఈ మానవుడు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర -సరస్వతి, లక్ష్మి, కాళిక కావచ్చు. యెహోవా, ఏసు, పరిశుద్ధాత్మ కావచ్చు. మహ్మద్, అల్లా కావచ్చు. ఇలా కుటుంబానికి అధిపతులు , దేవతలుగా, ఇలవేల్పులుగా ప్రజలకు సుపరిచితమే. వీరు ఆయా కుటుంబాలకు అధిపతులుగా(Head of the family) ఉంటారు.

ప్రతి వ్యక్తి తన స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని తెలుసుకున్న తరువాత, తన యూనిట్‍ను తెలుసుకోగలడు. తద్వారా తన కుటుంబాన్ని తెలుసుకోగలడు. కంటితో చూసి తెలుసుకోగల గుర్తులు, తెలుసుకోవడం అనే ప్రక్రియలో ఒక చిన్న సాధనం మాత్రమే అని ఇక్కడ గుర్తుంచుకోవాలి.

వ్యక్తి తన కుటుంబ సభ్యులను గుర్తించడానికి కూడా ఇక్కడ చిన్న గుర్తు తెలుసుకుందాం. అదేమిటంటే- పాదాల వేళ్ళ నిర్మాణ స్వరూపం. ఇది కుటుంబం మొత్తానికి ఒకేలాగా ఉంటుంది. వ్యక్తి( దేహం) మూలాలు అయిన పాదాలు భూమిపైన ఉంటే, కుటుంబ మూలాలు భూమిలో ఉంటాయి.

కుటుంబంలోని సభ్యులందరూ ఈ కుటుంబ అధిపతితో అవిభాజ్యమైన (విడదీయలేని) భాగాలుగా ఉంటారు. 

భౌతికం అనగా! పంచ భూతాత్మకంగా పిలువబడే దేహాలు అవి ఆడ+ మగ  - ఇవి బౌతిక నేత్రాలతో చూడగలిగినవి.
భూమి, సముద్రం, నక్షత్రాలు, గ్రహాలు - ఉపగ్రహాలు, ఉల్కలు, రాయీ, ఇనుము, బంగారం మొదలైనవి సమస్త వస్తు, జీవజాలం అంతటి లోనూ స్త్రీ , పురుష "శక్తి" సామర్ధ్యం ఇమిడి ఉంటుంది.
    రాయి అనే పదార్థానికి మూలం రాయి అనే వ్యక్తిత్వం ( కారెక్టర్) కలిగిన ఆత్మ, ప్రకృతి స్వరూపాలయిన ఆడ, మగ- ఇవి ఒకే జంట అయి ఉంటుంది. ఈ జంట అనేది సహజమైంది, స్వచ్ఛమైంది.
     అధి భౌతికం అనగా అంతర్ నేత్రంగా పిలువబడే నేత్రాలతో మాత్రమే చూడగలిగిన దేహాలు,  ప్రకృతి + పురుష లేదా, శక్తి స్వరూపం + ఆత్మ స్వరూపం.
     ప్రతి వ్యక్తికీ భౌతికం, అధి భౌతికం అనే ఈ రెండు రూపాలు ఉంటాయి.
     ఈ రెండు రూపాలకు ఆధారమైన మూల స్వరూపాలు ఉంటాయి. వాటి కేంద్రాలు వేరు వేరుగా ఉంటాయి. స్త్రీలకు మూల ప్రకృతి మూలంలో స్థానం ఉంటుంది. భౌతిక ప్రపంచం అనేది ప్రకృతి యొక్క స్వరూపం. దీనికి మూలం "భూమి" . ఆత్మలకు మూలం దైవం అనే వ్యక్తిత్వం కలిగిన దైవాత్ముడు ఆత్మలకు మూల స్థానం.
      వ్యక్తి అస్తిత్వం అనేది వ్యక్తి యొక్క మూల స్వరూపాలకు భౌతిక స్వరూప ప్రతినిధి. ఆత్మ మూలాలను ప్రకృతి మూలాలను, కలిపే జంక్షన్ ఆడ, మగ వ్యక్తులు.
     ఈ వ్యక్తి " పునాది " ఆధారంగా విశ్వంలో వ్యక్తికి అనేక స్థావరాలు, అనేక అస్తిత్వాలు ఉన్నాయి. విశ్వ వ్యాప్తమై ఉన్న "వ్యక్తిత్వం" గురించి ఈ సందర్భంలో తెలియజేయబడటం లేదు. అయినా ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి.
    కోట్ల సంఖ్యలో వ్యక్తులు గల కుటుంబాలు వేల సంఖ్యలో భూమి కేంద్రంగా నివసిస్తున్నాయి.   

24, మార్చి 2015, మంగళవారం

మానవ శాస్త్రం HUMONOLOGY




మనిషి గురించి "సంపూర్ణంగా" తెలియజేయడం, మనిషి సమస్యలు వివరించి దానికి పరిష్కారం తెలియజేయడం, భవిష్యత్తులో "సమస్యలు" రాకుండా ఎలా జీవించాలో తెలియజేయడం మానవశాస్త్రపు "లక్ష్యం"

    మనిషి అనగా!

        అణువులోని శాశ్వత సభ్యుల పూర్ణత్వమే మనిషి. మానవుడు, వ్యక్తి వంటివి మనిషికి పర్యాయ పదాలుగా వాడుకుంటున్నాం. అయితే మనిషి, మానవుడు ఒక్కటే గానీ, మనిషి, వ్యక్తీ సమానార్ధకాలు కావు.
        అణువులో మొత్తం ముగ్గురు మగవారు, ముగ్గురు స్త్రీలు, ఉంటారు. ఈ మొత్తం ఆరుగురి సమగ్ర స్వరూపమే "మనిషి" అనగా మనిషి= అణువు. అణువులో లేదా మనిషిలో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉంటారు.

    
ఈ ఆరుగురు వ్యక్తులు మూడు శాశ్వత స్వభావాలనూ, వ్యక్తిత్వాలనూ కలిగి ఉంటారు. స్వభావం అనగా ఎలాక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్‍లని అర్థం.
   
    ఎలక్ట్రాన్ అనేది ప్రకృతి స్వరూపంగా ఉండి భౌతిక దేహాలకు మూలమై, భౌతిక స్వరూపాల ఆధారంగా శక్తిని సృష్టించే మూల పదార్ధంగా ఉంటుంది.
    ప్రోటాన్ అనేది ఆత్మ స్వరూపాధిపతిగా ఉండి బలాన్ని పెంపొందించే సాధనంగా పని చేస్తుంది.
    న్యూట్రాన్ అనేది మనస్సు యొక్క స్వరూపమై మొత్తం యూనిట్ యొక్క సామర్ధ్యంగా ఉండి, శక్తిని సమన్వయం చేసే మూల పదార్ధంగా ఉంటుంది.

            ఆత్మలకు సూర్యుని నుండి
            మనస్సుకు చంద్రుని నుండి
            శరీరానికి భూమి నుండి
            శక్తి సమకూరుతుంది

    స్వభావాలకు మూలం సూర్యుడు, చంద్రుడు, భూమి ( సూర్యుడు = ప్రకృతి+ పురుషుడు; చంద్రుడు = ప్రకృతి+ పురుషుడు; భూమి = ప్రకృతి+ పురుషుడు). వీరికి కూడా ఆత్మ స్వరూపాలు, ప్రకృతి స్వరూపాలుఉంటాయి. వీరూ చావు, పుట్టుక అనే చట్రంలో వ్యక్తులుగా జీవిస్తూ, సమస్త మానవుల అభివృద్ధికి మూలంగా ఉంటారు.

    ప్రతి స్వభావ స్వరూపానికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం (క్యారెక్టర్) ఉంటుంది.
   
    మనుషులందరూ(వ్యక్తులు) ఒకటే అనే భ్రమ బాగా చలామణీలో ఉన్నా, తక్షణం కంటి చూపుతోనే ఈ బేధాన్ని వ్యక్తులు గుర్తించగలిగే గుర్తును ఈ సందర్భంలో తెలియజేస్తాను. వ్యక్తుల చెవి నిర్మాణాన్ని గమనించండి. చెవి పోగులు పెట్టే కింది భాగంలో అతుకుని ఉన్నట్టుండి చిన్నగా కనిపించే చెవులు, వెడల్పుగా కనిపించే చెవులు, మధ్య రకంగా ఉండే చెవులు - మూడు రకాల స్వభావాలను తెలియ జేస్తాయి.

    ఒక వ్యక్తిత్వం ఈ మూడింటిలో ఏదో ఒక స్వభావానికి ప్రతినిధి అయినప్పటికీ, ప్రతి వ్యక్తి దేహం ఈ మూడు స్వభావాలతోనే నిర్మితమై ఉంటుంది. కాబట్టి ప్రతి భౌతిక దేహం కలిగిన వ్యక్తిలో ప్రకృతి, మనస్సు, ఆత్మ అనుసంధానం చేయబడి నిర్మించబడ్దాయి.

    ఈ అంశాన్ని వ్యక్తి దేహంలో సులభంగా గుర్తించే గుర్తులున్నాయి. అవి ఏమంటే - వ్యక్తి చేతి, పాదాల వేళ్ళు.

బొటన వేలు న్యూట్రాన్‍కు, చూపుడు వేలు, నడిమి వేలు ప్రోటాన్‍కు, చివరి రెండు వేళ్ళు ఎలక్ట్రాన్‍కు ప్రతినిధులుగా ఉంటాయి. వ్యక్తి తన యూనిట్ సభ్యుల స్థితిగతులను వేళ్ళు ఉన్న స్థితిని బట్టి అంచనా వేయవచ్చు.

    ఒకే వ్యక్తిత్వం ఉన్న ఆడ, మగ వ్యక్తులు తమ వ్యక్తిత్వపు రెండో సగాన్ని గుర్తించడానికి సులభమైన గుర్తు ఉంది. అది వ్యక్తి యొక్క స్వభావాన్ని గుర్తించే సాధనం : చెవి నిర్మాణంతో పాటు అదనంగా చేయి, పాదాలలో ఉండే రేఖల నిర్మాణం ఒకే వ్యక్తిత్వపు వ్యక్తులకు ఒకేలాగా ఉంటాయి.

    ఉదా:  న్యూట్రాన్ స్వభావం కలిగిన మార్టిన్ అనే వ్యక్తి - ధర్మం అనే వ్యక్తిత్వాన్ని కలిగిన ఆత్మ స్వరూపుడు అనుకుంటే; ధర్మం అనే వ్యక్తిత్వాన్ని కలిగిన న్యూట్రాన్ స్వభావిని అయిన ప్రకృతి స్వభావిని అయిన ప్రకృతి స్వరూపిణి మేరీ అనే అమ్మాయికీ , అంటే ధర్మం వ్యక్తిత్వం కలిగిన  మార్టిన్, మేరి అబ్బాయి, అమ్మాయిలకు మాత్రమే ఒకే రకమైన రేఖలు చేతులలో, పాదాలలో ఉంటాయి. వందల కోట్ల వ్యక్తులలో ఒకే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులకు మాత్రమే ఒకేలాగా రేఖలు ఉంటాయి వారు మాత్రమే MEDE FOR EACH OTHER

23, మార్చి 2015, సోమవారం

ఒక్క క్షణం....

                                                   


                                                                                          - ఆచార్య మేడిపల్లి రవికుమార్
                                                                                            శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం,
                                                                                                      తిరుపతి            
                                                                                                                                                                                                                                                                                                                                             
    " ఒక విధ్వంసం జరగకుండా ఒక నూతన నిర్మాణాన్నీ, గతాన్ని సమీక్షించకుండా ఒక మంచి భవిష్యత్తునూ ఊహించలేం !"

         ఏదైనా ఒక కొత్త అంశం- అది అనుభవం కావచ్చు. అనుభూతి కావచ్చు. అది జీవితానికో, సృష్టికో సంబంధించిన ఒక సిద్ధాంతం కూడా కావచ్చు - మనల్ని తట్టినప్పుడు ప్రకంపనలు తప్పవు - వేల సంవత్సరాలుగా ప్రపంచంలో జరిగింది ఇదే !
   
        ప్రతి ప్రకంపనకీ నడిమి కాలం ఒక క్షణం కావచ్చు, ఒక యుగం కావచ్చు. ఖచ్చితంగా కాలం గురించి చెప్పలేనుగానీ "ఇది" కూడా ఒక ప్రకంపనే.
   
దీన్ని ఒక గ్రంథమనో, ఒక వ్యాసమనో, ఒక సిద్ధాంతమనో, ఒక ప్రేలాపన అనో, ఒక వెర్రి ఊహ అనో చెప్పలేను - ఎందుకంటె ఎందులోనూ ఇది ఇమడదు.

    ధర్మం - సత్యం - కాలం - ప్రకృతి - పురుషుడు - వ్యక్తి - మనిషి - కుటుంబం- అణువు - పరమాణువు - శక్తి - శ్రమ - భూమి- ఈశ్వరుడు - క్రీస్తు - అల్లా ... ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి అసలైన స్వరూప స్వభావాలు, రంగు రుచీ వాసనలో ఇవి ఇలాగే ఉంటాయి గాబోలు.

    ఇది కంటితో చూసి చదివితే ఒక పట్టాన అర్థమయ్యేది కాదు - జీవితానుభవంతో దర్శిస్తేనే కొంత మేర చేరుకోగలం. ఈ ప్రక్రియ జరిగిన తరువాత మనం రిలాక్స్ కావచ్చు - కలవరపడవచ్చు - విపరీతమైన ఆకలి అవచ్చు - ఆకలి లేకపోవచ్చు - కుంభకర్ణుడి నిద్రపోవచ్చు - నిద్ర లేని రాత్రులు  గడపొచ్చు - భార్యనో, భర్తనో ఆమడ దూరంలో ఉంచొచ్చు - అమాంతంగా ఆలింగనం చేసుకోవచ్చు - ముద్దులు పెట్టవచ్చు - హద్దులు మీరవచ్చు - అద్దంలో మన శరీరాల్ని నగ్నంగా చూసుకొని గ్రీకు పురాణ నాయకుడు (NARACISSUS) లాగా మనకు మనం ముద్దాడుకోవచ్చు - మన మీద మనకే అసహ్యమేసి అద్దాన్ని పగలకొట్టవచ్చు - కొన్ని ధర్మాల్ని, వాస్తవాల్ని గుర్తించకపోతే దర్శించబోయే భవిష్యత్తు రూపాన్ని చూసి మన తలలు నేలకేసి కొట్టుకోకుండానే బద్దలు కావచ్చు - ఇంకా ఏవేవో జరగొచ్చు - అసలేమీ జరగక పోవచ్చు - ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే పై వాటిలో ఏవి జరగినా జరగకపోయినా అది దీని తప్పు కాదు. వేల సంవత్సరాలుగా మన రక్తంలో ఇంకి పోయిన, మనల్ని మన జీవితాల్ని నడిపిస్తున్న, శాసిస్తున్న భావజాలమే అందుకు కారణం.

    వ్యక్తికీ, మనిషికీ తేడా ఏమిటి ? దైవానికీ దయ్యానికీ భేదం ఏమిటి ? మార్క్స్ కూ మార్క్సిస్టులకీ వైరుధ్యం ఉందా ? స్త్రీ పురుషులు ఎవరు ? మనలో సగ భాగంగా ఉండి జీవితాన్ని పంచుకుంటున్న వాళ్ళు నిజంగా మన భార్యలు, మన భర్తలేనా ? జీవితాలు ఎందుకు దారి తప్పుతున్నాయి ? కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయి ? అక్రమ సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి ? హత్యలు, అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి ? వాటి వెనుక ఉన్న శక్తులు ఏమిటి ? ఇందులో ఎవరు నేరస్తులు ? జన్మనిచ్చిన వాళ్ళూ, తోడబుట్టిన వాళ్ళూ నిజంగా నీ కుటుంబ సభ్యులేనా ? ఇలాంటివి మనల్ని భయకంపితుల్ని చేసే గంభీరమైన ఆలోచనలు కావచ్చు, చొప్పదంటు ప్రశ్నలూ కావచ్చు. వీటి పట్ల మన మనస్సు కొంతసేపు లగ్నం చేయాలంటే మన శరీరానికీ, మన మనసుకూ ఎంతో శక్తి కావాలి. మరెంతో ధైర్యం ఉండాలి. వీటన్నింటినీ మించి నీ గురించీ, మనిషి గురించీ, దైవం గురించీ, ధర్మం గురించీ, ప్రకృతి గురించీ, ముఖ్యంగా "భవిష్యత్తు" గురించీ వాస్తవం తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉండాలి.

    ఇందుకు సిద్ధమైన వాళ్ళు ఎవరన్నా ఉంటే దీన్ని తెరవండి. కలిచివేసిన అంశాలు ఏవన్నా ఉంటే వాటి గురించి ఆలోచించండి. భయపడకుండా మరొకరితో పంచుకోండి. కలవరపెట్టిన అంశాలు ఏమీ లేకపోతే దీన్ని మరొకరి దర్శనంలో ఉంచండి. వాళ్ళకీ ఇదే అనుభవమైతే దీన్ని కాల్చివేయమని చెప్పండి. వీటిలో ఏది చేసినా లాభమే. నష్టం లేదు.

మానవ శాస్త్రము

మానవ శాస్త్రము మనిషికీ, వ్యక్తికీ ఉన్న తేడాను తెలియజేస్తూ MADE FOR EACH OTHER అనే భావన ద్వారా , మానవుని సమస్యలన్నింటికీ పరిష్కరాన్ని తెలియజేస్తుంది.