31, మే 2015, ఆదివారం

ధర్మబద్ధమైన జీవితం



కాలాన్ని, వ్యక్తిని, కుటుంబాన్ని, సమాజాన్ని అనుసరించి సమన్వయం చేయాలంటే ధర్మబద్ధమైన జీవితం అనివార్యమైన షరతు.

పరస్పర సంబంధాలతో ముడిపడిఉన్న ఈ సృష్టిలో సమస్త విశ్వాలలో ఏ వ్యక్తి అయినా ధర్మ బద్ధంగా జీవించాలంటే దానికి ముందు సత్యం- ధర్మం- కాలం అనే వ్యక్తిత్వాలు ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రారంభించి తీరాలి.

ఈ మూడు అస్థిత్వాలకు ఆధారమైన ప్రకృతి, పురుష స్వభావాలు ధర్మబద్ధమైన జీవితం జీవించడానికి పనికి రాని విధంగా చెడిపోయిఉంటే  వారి గురించి ఆంందోళన చెందనవసరం లేదు. ఎందుకంటే వ్యక్తులు, వ్యక్తిత్వాలు వేరువేరు అంశాలు. వ్యక్తిత్వం అధికారం అయితే వ్యక్తి అధికారి. అధికారి అవినీతి పరుడైతే అతడిని తొలగించి వేరే అధికారిని నియమించడం ఎంత సహజమో ఇది కూడా అలాగే జరుగుతుంది.

30, మే 2015, శనివారం

ప్రకృతి-పురుషుడు- కాలం




వ్యక్తిత్వపు రెండు కొసలు అయిన ప్రకృతి, పురుషుడికి మధ్య అనేక అస్థిత్వాలను కలిపే పదార్ధం ధర్మం కాగా వీటిని సమన్వయం చేసే పదార్ధం కాలం.

వ్యక్తి, వ్యక్తిత్వం, కాలం  అనేవి అవిభాజ్యమైనవి. వ్యక్తి చెడిపోతే, వ్యక్తిత్వం, కాలం కూడా చెడిపోతాయి. విశ్వంలో అనేక స్థల కాలాలలో అస్థిత్వం ఉన్న వ్యక్తిత్వం సమన్వయం కావాలంటే తప్పని సరిగా కాలం అనేది స్వచ్చంగా, సరళంగా, ధర్మబద్ధంగా ఉండి తీరాలి.

లేదంటే కాలం కాస్తా వ్యక్తి జీవితానికి మంచి కాలంగానూ, చెడు కాలంగానూ, అకాలం, సకాలం, యుద్ధకాలం, శాంతికాలం- ఇలా అనేక ద్వంద్వస్వభావాలతో  వ్యక్తి జీవితంతో జూదమాడుతుంది.

వ్యక్తి కలుషిత బంధ అధర్మ జీవితం వ్యక్తి కాలాన్ని నిర్దేశిస్తుంది.

వ్యక్తి స్థితి, గతి, స్వరూప, స్వభావాలకు కాలం యొక్క స్థితి, గతి, స్వరూప, స్వభావాలకు ఉన్న పరస్పర సంబంధం అర్థం గాక, వ్యక్తి కోరికలు మాత్రం మేఘాల రెక్కలతో విశ్వ విహారం చేయాలంటాయి.

29, మే 2015, శుక్రవారం

కాలము (TIME)



కలుషిత వ్యక్తిత్వాల అధర్మబద్ధమైన జీవన స్థానంలో స్వచ్చమైన, ధర్మబద్దమైన జీవనం నెలకొల్పడానికి సహకరించవలసిన మరొక పదార్ధం "కాలం".

కాలపురుషుడు, ప్రకృతి కూడా కలుషిత వ్యక్తిత్వపు అధర్మ జీవనం ద్వారా కాలాన్ని గతి తప్పించారు. కలుషితం చేసేసారు.

కాలపురుషుడు, ప్రకృతి ధర్మబద్ధమైన జీవనం ప్రారంభించనంత వరకూ సత్యం, ధర్మం తమ అస్థిత్వాలలో నిలబడలేవు. సత్యం, ధర్మం, కాలం అనే మూడు పదార్ధాలు ఒకే యూనిట్ కాబట్టి, ఈ మూడు పదార్ధాలు ఏక కాలంలో ధర్మ బద్ధమైన జీవితాన్ని ప్రారంభించాలి.
వ్యక్తులు ధర్మబద్ధంగా జీవించాలి. సత్యం తెలుసుకోగలగాలి అనే సంకల్ప శక్తి ద్వారా రకరకాలుగా చిద్రమైన కాలాన్ని తన స్వీయ గతిలోనికి తీసుక రాగలరు.

8, మే 2015, శుక్రవారం

స్వార్ధ పూరిత దృఢ సంకల్పం ఉన్న వారికి స్వాగతం.



               మానవుడు అంటే 50  కేజీలో 100 కేజీలో ఉన్న అల్ప మాంసపు ముద్ద  మాత్రమే కాదు. సమస్త విశ్వాలలో వ్యాపించి ఉన్న ఆత్మ, ప్రకృతుల యొక్క స్వరూపులు, దైవపుత్రులు.

ఒక్కటే అనేకంగా మారలేదు. అనేక వ్యక్తిత్వాలకు ఆధారంగా ఉన్నది దైవం ఒక్కటే!

సొంత వ్యక్తిత్వాన్ని
సొంత ఇంటినీ
సొంత కుటుంబాన్నీ
చేరుకోవాలనే స్వార్ధపూరిత దృఢ సంకల్పం ఒక్కటి ఉంటే చాలు మనం ఉన్నదే దేవుని ఒడిలో అని తెలుసుకోవడానికి.

అపనమ్మకం అనే అసత్య, ఆదర్శ దృష్టిని విడనాడి; తెలుసుకోవడం అనే సత్యం యొక్క ధర్మ నేత్రాలు తెరవండి.
రాబోయే కాలం - ధర్మ బద్ధంగా జీవించాలి అనుకునే వారిదే.

ఎందుకంటే కాలం కూడా కష్ట కాలంలో ఉంది. కాలనాగు, కాలభైరవుడు, కాల యముడు ఇలా ఎందరి చేతుల్లోనో ముక్కలై కాలం స్వీయ అస్థిత్వాన్ని కోల్పోయింది.

ఙ్ఞానం లేని జీవి , దైవాన్నెరుగని జీవి  సృష్టిలో ఒక్కటి కూడా లేదు.  కాస్త విచక్షణతో ఆలోచించడి. నేడు మీ దగ్గర ఉన్న ఙ్ఞానం రెండు రూపాలుగా ఉంది. ఒకటి- మీ వ్యక్తిత్వాన్ని చిద్రం చేసే తప్పుడు ఙ్ఞానం . ఇది బంధం ఫలితంగా జనించింది. రెండవది- మీ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే సరియైన ఙ్ఞానం. దీనిని మీకెవరూ నేర్పరు. ఎందుకంటే ఇతరులకు నేపేది తప్పుడు ఙ్ఞానమే. సరియైన ఙ్ఞానము నీలోనే ఉంది. దానిని నీవు మాత్రమే వెలికి తీసి వినియోగించగలవు. దానిని వెలికి తీయడానికి ఇతరుల సహాయం ఖచ్చితంగా తీసుకోకూడదు.

ఎందుకంటే - ప్రతీ వ్యక్తీ స్వీయ ఙ్ఞాబ్నం, ఙ్ఞాపకం అన్నీ కూడా ఆ వ్యక్తి ప్రకృతి మూలంలో నిక్షిప్తం అయి ఉంటాయి.

ప్రకృతి మూలం నుండి ఆ ప్రకృతి యొక్క పురుషుడు మాత్రమే ఆ రహస్యాలను తెలుసుకోగలడు. వేరెవ్వరికైనా అది అసాధ్యం.

సొంత జీవితాన్ని వదిలి, సొంత ఙ్ఞానాన్ని గ్రహించలేని స్థితికి చేరుకున్న మానవుడు, వ్యక్తి బతకడానికి కావలసిన కనీస ఙ్ఞానం కూడా ఇతరుల దగ్గర సంవత్సరాల తరబడి అడుక్కుంటూ , పరీక్షలకు గురవుతున్నాడు. అధర్మం పైన వృద్ధి చెందే ఏ వ్యవస్థ అయినా ముందుగా వ్యక్తులను అడుక్కునే వారిగానో, దానం చేసేవారిగానో చేస్తుంది.


7, మే 2015, గురువారం

దేవుడు- మానవుడు



దైవం అంటే ఈ సమస్త విశ్వాలను సృష్టించే సృష్టి కర్తలైన మానవుడికి కావలసినంత శక్తినీ, సామర్ద్యాన్నీ, సాధనాలనూ అందించేది మాత్రమే.

అంతేకానీ; ప్రార్థనలు, ప్రసాదాలు, భక్తి, అభిషేకాలు, లాంటి తుచ్చమైన చర్యలను ఆశించడం, స్వీకరించడం, అనే పదాలకు అర్థం తెలియని అమాయకుడు  దైవం.

అసత్యంతో, అధర్మంగా మానవుడెన్ని తప్పుడు పనులు చేసినా ఏ నాటికైనా తెలుసుకుంటాడులే అని మానవుడి దుష్ట చర్యలు బాధిస్తున్నా పంటీ బిగువున భరిస్తున్నవాడే దైవం( దేవుడు+దేవత)

ఆమ్యామ్యా ఇవ్వకపోతే మీ పని జరగదనే లంచగొండి భిక్షగాడు కాదు దైవం అంటే.

మీకు తెలుసా ఈ మహా విశ్వాన్ని సృష్టీంచింది ఎవరో?

"ఈ మహా విశ్వం సృష్టి యాంత్రికంగా జరిగిపోయింది"  అనే మూర్ఖులను వదిలిపెడితే ; ఇది దేవుని పనీ, లేదా ఏదో తెలియని మహాశక్తి అని నమ్ముతున్నారు కదా!

అది అసత్యం!
సత్యం ఏమంటే-
మానవుడే ఈ విశ్వ నిర్మాత !

మానవుడే ఈ సమస్త విశ్వానికి కేంద్రం!

మానవుడి కోసమే ఈ సమస్త విశ్వాలు ఉన్నాయి.
మానవుల ఆట వస్తువు   ఈ సమస్త విశ్వం.
ఇదే సత్యం.

6, మే 2015, బుధవారం

పరాయీకరణ



                  పరాయీకరణ పాలైన మీ స్వంత వ్యక్తిత్వానికి  గతాన్ని మరచిపోవడం అనేది ఒక ప్రత్యేకత. మన మతిమరుపు ఆధారంగా పుట్టుకొచ్చిన కొత్త మోసగాళ్ళే దైవ ప్రచారకులు., మతాలు, గురువులు, బాబాలు, సైన్స్ వాదులు మొదలైన వాళ్లు. మన నిస్వార్ధత, త్యాగ గుణం, నమ్మకం, అపనమ్మకం లాంటి దుర్గుణాలే వీరికి సోపాన మార్గాలు.

              స్వంత పదార్ధం అంతా స్వంతం చేసుకోవాలనుకునే స్వార్ధపరులకు స్వాగతం. ఎందుకంటే స్వ+అర్థం = మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం.

             మనలో దాగి ఉన్న ప్రేమను, ఆనందాన్ని, శాంతినీ మనలో మనమే వికసింపజేసుకోవడం, మన శక్తి సామర్ధ్యాలతో మనమే ఐశ్వర్యాన్ని సృష్టించి భోగలాలసలో మనమే తేలుతూ ఉంటే ఈ సృష్టికి ఆధారమైన దైవానికి( దేవుడు+ దేవత) సంతోషం.

                  ఇంతటి విశాల విశ్వంలో మనం మనలోనే ఉన్న శాంతి కోసం , ఆనందం కోసం అడ్డమైన గాడిదల్లాంటి తప్పుడు ఙ్ఞానం కలిగిన గురువులు, ఙ్ఞానులు, దేవతలు( ఇలాంటి పేర్లను వీరు , వీరి శిష్యులు అనగా వ్యాపార భాగస్వామి సృష్టించి ప్రచారం చేసేవి) వెంట భిక్షగాళ్ళులాగా వెంట పడడం దైవానికి బాధ కలిగించే అంశం.


5, మే 2015, మంగళవారం

ఇల్లలుకుతూ పేరు మరచిపోయిన ఈగ



దేవుడు. సైన్స్ పదార్ధాలే భిన్నమైనవి.మూఢవిశ్వాసాలు కామన్. వర్తమాన జీవితంలో వ్యక్తులను సైన్స్ పేరుతో భయ భ్రాంటులను చేయగల నేర్పు వీరికి మాత్రమే ప్రత్యేకం. 

మత వ్యవస్థలకు చిక్కని మొండి ఆత్మలు, ప్రకృతులు ఏమైనా ఉంటే అవి కూడా తప్పించుకోలేని ఆఖరి అస్త్రం ఒకటి ఉంది. అది మత వ్యవస్థలకు సైన్యాధ్యక్షుడు అయిన వైద్యం. పెట్టుబడిదారీ విధానం అనేది మతం ముద్దుబిడ్డ.

ఇన్ని వ్యవస్థలు గంభీరంగా, దృఢమైన స్వరాలతోమేము చెప్పిందే సత్యం అని ఊదరగొడుతుంటే - ఈ వ్యవస్థీకృత బంధాలనుండి తప్పించుకొని సత్యమేదో, ధర్మమేదో , అధర్మమేదో తెలుసుకోవడం అసాధ్యమనీ, అది మహానీయులకు మాత్రంఏ సాధ్యపడే అంశమనీ ఎన్నో యుగాల తపః ఫలమనీ ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు మనకున్నాయి కదా!

ఒక ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరచిపోయిందని మనకొక కథ. 

విశ్వనిర్మాణం చేస్తూ చాలా దూరం వెళ్ళిపోయి, సొంతకుంటుంబాబ్బి, సొంత ఇంటినీ, సొంత అస్థిత్వాన్నీ వ్యక్తిత్వాన్నీ కూడా మరచిపోయిన వ్యక్తులం మనం.

కంటికి కనిపించని అణువుకు - అణువు కంటే చాలా చిన్నగా ఉన్న పదార్ధాన్ని దైవకణమని సైంటిస్టులు నేటికి గుర్తించగలుగుతున్నారు. మరి అలాంటి అణువులు లక్షల కోట్ల సంఖ్యలో ఉండే వ్యక్తికి ఆధారంగా దైవం ఉండదా?

అది మీకు తెలియదా?

4, మే 2015, సోమవారం

మార్క్సిస్టుల వాదనలు




                      మార్సిస్టులు ఈ సూత్రీకరణను నిర్లక్ష్యం చేసి నిర్మించిన బలహీన వ్యవస్థలే నాటి కమ్యునిస్టు దేశాలు.

                                             శ్రామికులు, కార్మికులు తమ శక్తి- సామర్ధ్యాలకు మించి పని చేసే సామర్ధ్యం కలిగి ఉండడం మార్క్స్ కు అర్థం కాని ప్రశ్న. శ్రామికులు ఇలా పని చేయడానికి మూలం బంధాలు. వీరు బంఢాలను దోచుకొని పని చేస్తారు. వీరి శ్రమ ఉత్పాదకతను (ఫలితం) పేట్టూబడి దారులు దోచుకుంటున్నారు. "దోపిడీ ప్రక్రియలో మొట్టమొదటి దోపిడీదారులు కార్మికులే". 

                       దోపిడీ ప్రక్రియలో అంతిమంగా దోపిడీకి గురవుతున్నది ప్రకృతీ స్వరూపాలైన స్త్రీలే. ఆత్మలు ప్రకృతులను దోచుకుంటున్నాయి.

     ఈ వరుసలోనే హేతువాదులు, నాస్తికులు, సైన్స్ పేరుతో తిరిగే గుంపులు చాలా ఉన్నా - వీరికో ప్రత్యేకత ఉంది.

                                          ఆధునికత, శాస్త్రీయత( సైంటిఫిక్) అనే ముసుగులు, పూర్వ వ్యవస్థ లొసుగులు వీరికి ఆహారం. సైన్స్ అనే పదార్ధం వీరి దృష్టి. అనగా శాస్త్రీయ దృక్పథం. మా దేవుడే నిజమైన దేవుడు అని ప్రచారం చేసే మూఢ విశ్వాసుల కన్నా మూఢ విశ్వాసులు వీరు.

3, మే 2015, ఆదివారం

మత సంస్థల సూత్రీకరణలు- ప్రలోభాలు -3

                      ఆత్మ గానీ ప్రకృతిగానీ స్థిరమైన అస్థిత్వం , వ్యక్తిత్వం కలిగి లేవు. పరిణామ స్వభావం కలిగినది ప్రపంచం. ఇందులో దుఃఖం ఉంది. దుఃఖ రహితమైన స్థితికి చేరుకునే మార్గం ఉంది. ఈ మార్గంలో నిర్వాణ స్థితినో, ఇంక దేనినే పొందక పోతే దుఃఖంలో పుట్టి , జీవించి, దుఃఖంలోనే మరణిస్తాడు. బుద్ధుడు, బౌద్ధం, బౌద్ధవాదులు తెలిపిన సత్యాలు తెలుసుకొని వారు చెప్పిన జీవన విధానంలో జీవించకపోతే ఎవరికైనా దుఃఖమే మిగులుతుంది. 

                     ఆత్మను , ఆధ్యాత్మిక జీవితాన్ని అంగీకరించే ఇలాంటి వారంతా మానవుడి భవిష్యత్తు గురించి ఇలా ఏదో ఒకటి చెప్పి తీరాల్సిందే. అప్పుడు మనిషి భయపడి ఏదో ఒక కంపెనీలో (మతం) సభ్యత్వం తీసుకుంటాడు.

                              ఇక ఆత్మ , ప్రకృతి అస్థిత్వాలను నిరాకరించి వర్తమాన మానవుడు, భౌతిక పదార్ధం యొక్క యాంత్రిక చలనంగా భావించే వారున్నారు. వీరిలో కార్ల్ మార్క్స్ ను అనుసరిస్తున్నామని చెప్పుకొనే కమ్యునిష్టులు ప్రథమ శ్రేణిలో ఉంటారు. ఎందుకంటే సిద్ధాంతం ఆధారంగా వీరు నూతన వ్యవస్థలను నిర్మించారు గనుక వీరు వ్యక్తి యొక్క గతం యాంత్రికం అనే భావం ప్రచారం చేస్తారు. విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత, ఘర్షణ, అభివృద్ధి నియమాన్ని గత వర్తమానాలకు అన్వయిస్తారు.వ్యక్తులు, వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉండాలని మార్క్స్ ఖచ్చితంగా చెప్పకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న మార్క్సిస్టులు మాత్రం గతం సృష్టించిన బంధ వ్యవస్థనే వ్యక్తిగత జీవితంలో ఆమోదించి అనుసరిస్తున్నారు. మార్క్స్ తనకు తెలిసినంతలో స్త్రీ పురుష సంబంధం గురించి ఒక గొప్ప సూత్రీకరణ చేసాడు. "ఒక స్త్రీ, తన పురుషుడిని చేరుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేని వ్యవస్థా నిర్మాణం జరగాలి" అని