25, ఏప్రిల్ 2015, శనివారం

మత సంస్థల సూత్రీకరణలు- ప్రలోభాలు



                        మత సంస్థలు ప్రజలను ఆకర్షించడానికి, వీలు కాకుంటే భయ పెట్టడానికి , వారు చేసుకున్న సూత్రీకరణ సారాంశాలను ఇక్కడ పరిశీలిస్తే అర్థం అవుతుంది. 

                   వర్తమానంలో వ్యక్తి తనకు ఉన్న సమస్యలకు కారణాలను వెతుకుతూ గతంలో తన చుట్టూ ఉన్న మానవ సంబంధాలలోకి తొంగి చూసి కార్యాకరణ సంబంధాన్వేషణ చేస్తాడు. భవిష్యత్తు ఎలా ఉంటే తాను బాగుండగలడో అంచనా వేస్తాడు. ఊహలు చేస్తాడు. ప్రతీ వ్యక్తీ సాధారణంగా చేసే పనికీ, ప్రశ్నకూ ముందే సిద్ధంగా ఉంచిన ఫలితాలు సమాధానాలు ఇలా ఉన్నాయి.

                    1. ఆత్మ మరణం లేనిది. దేహం( వ్యక్తి) దేహి ( ఆత్మ) ధరించే చొక్కా లాంటిది. దేహం ద్వారా జరిగే పనులకు ఫలితాలు ఉంటాయి. వాటిని అనుభవించడానికి పునర్జన్మ అనేది ఉంటుంది. జనన మరణాలు అనివార్యం అనేది ఒక సమాధానం. ఈ సమాధానానికి బలమైన వేదిక భారత దేశం. "గతంలోనూ, వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ దేహి తన దేహం ద్వారా కర్మ ఫలాలను తానే అనుభవిస్తాడు." 

ఆత్మకు మరణం లేదు. కర్మ ఫలాలు ఆత్మ నంటవు. అగ్ని దహించదు. నీరంటదు లాంటి సూత్రీకరణలు ఉంటాయి. 

                     ఈ సిద్ధాంతం ఒకే కుటూంబంలోని మూడు రకాల వ్యక్తిత్వాలను దైవ, రాక్షస, మానవ గణాలుగా విభజించి మొదలవుతుంది. ఈ రకమైన విభజనను ఈ దేశ ప్రజలు ఎంత మంది ఎలా చూస్తున్నారో తెలిసిందే. దాని గురించిన పర్యావసానాలు ఇక్కడ అప్రస్తుతం. 

                     ఈ విభజనలోని దైవ, రాక్షస, మానవ వ్యక్తిత్వాలు నిజానికి ఒక అణువులోని మూడు విరుద్ధ గుణాలు తప్ప మరేమీ కాదు. ప్రతీ భౌతిక కుటుంబంలో ఈ మూడు రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. 

            సత్యం విషయంలో ఇష్టం, అయిష్టం అనేవి ఉండవు. 
అసత్య విషయంలోనే ఇష్ట, అయిష్టం , అంగీకారం, వ్యతిరేకత, వాదన, ప్రతి వాదనలు ఉత్పన్నం అవుతాయి.

                వీరికి స్వర్గం, నరకం, వైకుంఠ ప్రాప్తి, మోక్షం, దైవంలో లీనం అయిపోవడం, నీచ స్థితినికలిగిన జన్మ లెత్తడం లాంటి అనేక భవిష్యత్తులు ఉన్నాయి.

                   గతాన్ని, భవిష్యత్తును చూపి వర్తమానంలో వ్యక్తులను భయపెట్టి, భ్రమ పెట్టి, ప్రలోభపరచి, హింసించి, సంహరించి, అదుపులో పెట్టుకోవాలని చూడడం వీటి చరిత్ర, ఇది వర్తమానం.

కామెంట్‌లు లేవు: