6, జూన్ 2015, శనివారం

విశ్వవినాశనం



                కాలుష్యం నుండి అసహజ బంధాల నుండి బయటపడడం అనే ప్రక్రియ కూడా ఒక్కరితోనే మొదలవుతుంది. అవ్వాలి కూడా. ఎందుకంటే అధర్మం సృష్టించే వైరుధ్యం, హింస, పీడనను అధర్మ- ఆత్మ స్వరూపుడు కూడా భరించలేడు. కనుక ఈ పరిణామం విశ్వవినాశనం అనే నూతన స్థితికి చేరుకుంది.

                 ఈ స్థితిని అధిగమించి మానవాళి సుఖశాంతులతో జీవించాలి అంటే ఒకే ఒక్క దారి ఉన్నది. సత్యం- అసత్యం, ధర్మం- అధర్మం ఏమిటి అనే "విచక్షణ" తనకు లేదు. కోల్పోయాను, అని గ్రహించగలిగిన వ్యక్తి తనకు తాను సత్యం తెలుసుకొని ధర్మ బద్ధంగా జీవించాలని సంకల్పించి , ఆ వైపుగా ప్రయాణం చేయడమే.

   

కామెంట్‌లు లేవు: