మార్సిస్టులు ఈ సూత్రీకరణను నిర్లక్ష్యం చేసి నిర్మించిన బలహీన వ్యవస్థలే నాటి కమ్యునిస్టు దేశాలు.
శ్రామికులు, కార్మికులు తమ శక్తి- సామర్ధ్యాలకు మించి పని చేసే సామర్ధ్యం కలిగి ఉండడం మార్క్స్ కు అర్థం కాని ప్రశ్న. శ్రామికులు ఇలా పని చేయడానికి మూలం బంధాలు. వీరు బంఢాలను దోచుకొని పని చేస్తారు. వీరి శ్రమ ఉత్పాదకతను (ఫలితం) పేట్టూబడి దారులు దోచుకుంటున్నారు. "దోపిడీ ప్రక్రియలో మొట్టమొదటి దోపిడీదారులు కార్మికులే".
దోపిడీ ప్రక్రియలో అంతిమంగా దోపిడీకి గురవుతున్నది ప్రకృతీ స్వరూపాలైన స్త్రీలే. ఆత్మలు ప్రకృతులను దోచుకుంటున్నాయి.
ఈ వరుసలోనే హేతువాదులు, నాస్తికులు, సైన్స్ పేరుతో తిరిగే గుంపులు చాలా ఉన్నా - వీరికో ప్రత్యేకత ఉంది.
ఆధునికత, శాస్త్రీయత( సైంటిఫిక్) అనే ముసుగులు, పూర్వ వ్యవస్థ లొసుగులు వీరికి ఆహారం. సైన్స్ అనే పదార్ధం వీరి దృష్టి. అనగా శాస్త్రీయ దృక్పథం. మా దేవుడే నిజమైన దేవుడు అని ప్రచారం చేసే మూఢ విశ్వాసుల కన్నా మూఢ విశ్వాసులు వీరు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి